Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో రికార్డు స్థాయిలో బంగారం స్మగ్లింగ్ కేసులు

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (22:30 IST)
దేశంలో బంగారం స్మగ్లింగ్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పెద్ద ఎత్తున బంగారం పట్టుబడినట్లు కేంద్రం వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. 
 
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు 3,917.52 కిలోల బంగారాన్ని సీజ్ చేసి 4,795 కేసులు నమోదు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌధురి సమాధానమిచ్చారు. 
 
ఈ సందర్భంగా 2020 నుంచి బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించి నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. 2022లో 3,502.16 కిలోల బంగారాన్ని సీజ్ చేసి 3,982 కేసులు నమోదు చేశామన్నారు. 
 
అలాగే 2021లో 2,383 కిలోల బంగారాన్ని సీజ్ చేసి 2,445 కేసులు నమోదు చేశారు. 2020లో 2,155 కిలోల అక్రమ బంగారాన్ని సీజ్ చేసి 2,567 కేసులు నమోదు చేశారు.
 
బంగారం స్మగ్లింగ్‌ను నియంత్రించేందుకు కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేయడమే కాకుండా అక్రమ బంగారం స్మగ్లింగ్ ముఠాల కార్యకలాపాలపై నిఘా ఉంచి ఇతర ఏజెన్సీల సమన్వయంతో పని చేయనున్నారు. 
 
ఈ స్మగ్లింగ్‌లో విదేశీయులు భారతీయులతో సిండికేట్‌గా ఏర్పడిన ఉదంతాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ 2020 నుంచి ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదయ్యాయని పంకజ్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments