ఆకాశానికి ఎగిరిపోయిన బంగారం ధరలు.. ఆల్‌టైమ్ రికార్డు

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (14:19 IST)
బంగారం ధర ఆకాశానికి ఎగిరిపోయింది. తద్వారా బంగారు కొనుగోలు చేయాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధర భగభగమంటూ మెరిసిపోతుంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో పరుగులు పెట్టింది. పసిడి ధరలు అమాంతం పెరిగిపోవడానికి కరోనా వైరస్ ప్రభావమే ప్రధాన కారణం. 
 
కరోనా వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం గట్టి పడొచ్చనే ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా భావించే బంగారానికి డిమాండ్ పెరిగింది. 
 
ఈ నేపథ్యంలో పసిడి ధర గ్లోబల్ మార్కెట్‌లో ర్యాలీ చేస్తోంది. దీంతో భారత్‌లో కూడా పసిడి పరుగులు పెడుతోంది. బంగారం ధర పెరుగుతూ రావడం వరుసగా మంగళవారంతో ఆరో రోజు కావడం గమనార్హం. 
 
ఈ కాలంలో పసిడి ధర రూ.2 వేలకు పైగా పెరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఫలితంగా కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొనసాగుతున్న బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. ఏకంగా రూ.45 వేలకు చేరుకుంది. కేవలం రెండు నెలల్లోనే రూ.5 వేలు పెరిగి రికార్డు నెలకొల్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments