Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశానికి ఎగిరిపోయిన బంగారం ధరలు.. ఆల్‌టైమ్ రికార్డు

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (14:19 IST)
బంగారం ధర ఆకాశానికి ఎగిరిపోయింది. తద్వారా బంగారు కొనుగోలు చేయాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధర భగభగమంటూ మెరిసిపోతుంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో పరుగులు పెట్టింది. పసిడి ధరలు అమాంతం పెరిగిపోవడానికి కరోనా వైరస్ ప్రభావమే ప్రధాన కారణం. 
 
కరోనా వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం గట్టి పడొచ్చనే ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా భావించే బంగారానికి డిమాండ్ పెరిగింది. 
 
ఈ నేపథ్యంలో పసిడి ధర గ్లోబల్ మార్కెట్‌లో ర్యాలీ చేస్తోంది. దీంతో భారత్‌లో కూడా పసిడి పరుగులు పెడుతోంది. బంగారం ధర పెరుగుతూ రావడం వరుసగా మంగళవారంతో ఆరో రోజు కావడం గమనార్హం. 
 
ఈ కాలంలో పసిడి ధర రూ.2 వేలకు పైగా పెరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఫలితంగా కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొనసాగుతున్న బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. ఏకంగా రూ.45 వేలకు చేరుకుంది. కేవలం రెండు నెలల్లోనే రూ.5 వేలు పెరిగి రికార్డు నెలకొల్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments