Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారమా... ఇక కొనగలమా?

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (18:11 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్నా బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంది. ఈరోజు బంగారం ధరలు కాస్తంత పెరిగాయి. గత నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు హాంకాంగ్ విషయంలో అమెరికా మరియు చైనా దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, కరోనా వైరస్ పెరగడం వంటి వివిధ కారణాల వల్ల పైపైకి ఎగబాకాయి.
 
ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫీచర్స్‌లో 10 గ్రాములకు 0.33 శాతం అంటే రూ.152 పెరిగి రూ.46,557 పలికింది. అలాగే వెండి కిలో 0.34 శాతం అంటే రూ.167 పెరిగి రూ.48,725 పలికింది. బంగారం ధర ఈ నెల ప్రారంభంలో రూ.45,556 పలికింది. ఆ తర్వాత 15వ తేదీన రూ.47,360కి పెరిగి, ఆ తర్వాత నుండి కాస్త తగ్గుముఖం పట్టింది.
 
ఈ రోజు రూ.46,550 కంటే పైకి చేరుకుంది. బంగారం ధర పెరుగుతూ పోతుంటే సామాన్యులకు గుండె ఆగినంత పని అవుతోంది. ఏ వేడుకలకు హాజరు కావాలన్నా బంగారం ధరించడం ఆనవాయితీగా వస్తోంది. పెళ్లిలో అయితే బంగారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అలాంటి బంగారం ధర పైపైకి ఎగబాకి, సామాన్యులకు మరింత దూరమవుతోంది. 
 
ప్రస్తుతానికి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బంగారం ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,100 వద్ద ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.44,3100 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.48,500గా ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments