Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరిలో పరుగులు తీసిన బంగారం.. మార్చిలో తగ్గిపోయాయ్..

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (12:07 IST)
ఫిబ్రవరి నెలలో పరుగులు తీసిన బంగారం, వెండి ధరలు మార్చి నెలారంభం నుండి తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే బుధవారం కూడా బంగారం ధర తగ్గి, దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల పసిడి ధర రూ.33,430కి క్షీణించింది. గత వారం రోజుల నుండి పసిడి ధరలలో తగ్గుల ప్రారంభమై బుధవారానికి రూ.1,220 తగ్గింది.


డిమాండ్ తగ్గడమే ఈ పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక వెండి ధరలు మాత్రం బంగారం ధరలతో సంబంధం లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.39,500 ధర పలుకుతోంది. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదలతో 1,286.95 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 15.12 డాలర్లకు చేరింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,675, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,460గా ఉంది. చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,030, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,810గా ఉంది. ఇలాగే కొనసాగితే బంగారు ఆభరణాలు కొనాలనుకునేవారికి ఇంతకంటే శుభవార్త ఉండదని సంబరపడిపోతున్నారు ప్రజలు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments