Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ సీజన్‌లో పరుగులు పెడుతున్న బంగారం ధరలు

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (19:18 IST)
దేశ వ్యాప్తంగా ఫెస్టివల్ మూడ్ నెలకొంది. ఈ సమయంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. గురువారం మరోమారు ఈ ధరలు పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.400 పెరిగి రూ.78 వేల మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడం, దేశీయంగాను వర్తకుల నుంచి కొనుగోళ్లు కొనసాగుతుండటంతో పసిడి రెక్కలు రావడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
బుధవారం రూ.77,850 వద్ద ముగిసిన బంగారం గురువారం మరో రూ.400 పెరిగి తాజా గరిష్ఠమైన రూ.78,250 మార్కును దాటినట్లు ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. మరోవైపు వెండికీ పసిడితో సమానంగా డిమాండ్‌ కొనసాగుతోంది. కిలో వెండి తాజాగా మరో వెయ్యి రూపాయలు పెరిగి రూ.94 వేల మార్కు చేరుకోవడం గమనార్హం. 
 
ద్రవ్యోల్బణం కట్టడికి ఇన్నాళ్లూ వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర బ్యాంకులు... ఇప్పుడు వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించేందుకు ముందుకొస్తున్నాయి. దీనికితోడు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కూడా పసిడికి డిమాండ్‌ ఏర్పడిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments