Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విజృంభణ: ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఉత్తర్వులు

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (14:38 IST)
భారత్‌లో కరోనా విజృంభణ సమయంలో భారత్ నుండి వెళ్లే ప్రయాణికులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ తరుణంలో జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు పలు దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను జర్మనీ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. భారత్‌ను హై ఇన్సిడెన్స్ ఏరియా కేటగిరీ కిందకు చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. 
 
దీని ప్రకారం భారతీయులకు జర్మనీలో ప్రవేశించేందుకు అనుమతి లభించనుంది. ఇందుకు సంబంధించి జర్మనీ ప్రభుత్వ ఏజెన్సీ రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ భారత్, నేపాల్, రష్యా, పోర్చుగల్, బ్రటన్‌లను హై ఇన్సిడెన్స్ ఏరియాలుగా వర్గీకరించామని తెలుపుతూ సోమవారం వెల్లడించింది.  
 
కొత్త మార్పుల కారణంగా విదేశీ ప్రయాణికులు జర్మనీకి వచ్చేందుకు పెద్దగా ఆంక్షలు ఉండకపోవచ్చు. ఇటీవలి కాలంలో పలు దేశాలు భారత్ ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఉండగా.. ఆ లిస్టు లోకి జర్మనీ కూడా చేరింది.
 
వారం క్రితం దుబాయ్ ప్రభుత్వం కూడా భారత ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. భారత్‌లో కరోనా కట్టడి అవుతూ ఉండడం.. వ్యాక్సినేషన్ కూడా వేగంగా జరుగుతూ ఉండడంతో ఎటువంటి లక్షణాలు లేని వారిని, వ్యాక్సిన్ వేయించుకున్న భారతీయులను ఇతర దేశాలకు వెళ్లే అవకాశాలను కల్పిస్తూ ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments