Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విజృంభణ: ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఉత్తర్వులు

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (14:38 IST)
భారత్‌లో కరోనా విజృంభణ సమయంలో భారత్ నుండి వెళ్లే ప్రయాణికులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ తరుణంలో జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు పలు దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను జర్మనీ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. భారత్‌ను హై ఇన్సిడెన్స్ ఏరియా కేటగిరీ కిందకు చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. 
 
దీని ప్రకారం భారతీయులకు జర్మనీలో ప్రవేశించేందుకు అనుమతి లభించనుంది. ఇందుకు సంబంధించి జర్మనీ ప్రభుత్వ ఏజెన్సీ రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ భారత్, నేపాల్, రష్యా, పోర్చుగల్, బ్రటన్‌లను హై ఇన్సిడెన్స్ ఏరియాలుగా వర్గీకరించామని తెలుపుతూ సోమవారం వెల్లడించింది.  
 
కొత్త మార్పుల కారణంగా విదేశీ ప్రయాణికులు జర్మనీకి వచ్చేందుకు పెద్దగా ఆంక్షలు ఉండకపోవచ్చు. ఇటీవలి కాలంలో పలు దేశాలు భారత్ ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఉండగా.. ఆ లిస్టు లోకి జర్మనీ కూడా చేరింది.
 
వారం క్రితం దుబాయ్ ప్రభుత్వం కూడా భారత ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. భారత్‌లో కరోనా కట్టడి అవుతూ ఉండడం.. వ్యాక్సినేషన్ కూడా వేగంగా జరుగుతూ ఉండడంతో ఎటువంటి లక్షణాలు లేని వారిని, వ్యాక్సిన్ వేయించుకున్న భారతీయులను ఇతర దేశాలకు వెళ్లే అవకాశాలను కల్పిస్తూ ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments