Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్‌ధన ఖాతాల్లోని సొమ్ము వెనక్కి... ఎవరికి.. ఎక్కడ?

Garib Kalyan
Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (12:19 IST)
కరోనా లాక్‌డౌన్ కారణంగా బ్యాంకుల్లో జన్‌ధన్ ఖాతాలు కలిగిన వారికి నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు డబ్బులు జమ చేస్తామని కేంద్రం వెల్లడించింది. ఆ ప్రకారంగా తొలి విడత నగదు సొమ్మును ఏప్రిల్ మొదటి వారంలో జమ చేసింది. 
 
అయితే, చాలా మంది జన్‌ధన్ ఖాతాలు కలిగివున్నప్పటికీ వారిలో చాలా మంది పీఎంజీకేవై పథకం కింద ఈ సొమ్మును పొందేందుకు అర్హులుకాదని తేలింది. దీంతో ఆ సొమ్మును తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెనక్కి తీసుకుంది. ఇలా మొత్తం రూ.16 కోట్లను వెనక్కి తీసుకుంది. 
 
కేంద్రం నిర్ణయం మేరకు.. పీఎంజీకేవై పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 473 తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల్లో ఖాతాలు కలిగివున్న సుమారు 9 లక్షల మందికి డబ్బులు జమయ్యాయి. వీరిలో 5,15,260 మంది మాత్రమే అర్హులని, మిగతా వారు అనర్హులని బ్యాంకు అధికారులు తేల్చారు. దీంతో అనర్హులకు ఖాతాల నుంచి డబ్బును వెనక్కి తీసుకుంది. 
 
అయితే, చాలా మంది డబ్బు పడిన వెంటనే డబ్బును విత్ డ్రా చేశారనీ, అలాంటి వారిని గుర్తించి, వారి నుంచి డబ్బును తిరిగి రాబట్టేందుకు చర్యలు చేపట్టినట్టు తెలంగాణ బ్యాంగు జనరల్ మేనేజర్ మహేశ్ తెలిపారు. ఆగస్టు ఒకటో తేదీ 2014 తర్వాత ప్రారంభించిన ఖాతాలు మాత్రమే అర్హమైనవన్న నిబంధనలు ఉన్నాయని వెల్లడించారు. తాము పొరపాటున నగదును జమ చేశామని, వారం తర్వాత దాన్ని గుర్తించామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments