కొత్త పథకాలన్నింటినీ కేంద్రం పెండింగ్‌, ఎందుకు?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (18:05 IST)
బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పథకాలన్నింటినీ కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. కరోనా మహమ్మారితో పోరాటం వేళ కేంద్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వాటికి నిధులు కేటాయించే పరిస్థితి ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది. బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పథకాలను 2021 మార్చి 31 వరకూ నిలిపివేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.
 
దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఖర్చును తగ్గించి, నూతన కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దానిపై పోరాటానికి వినియోగించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర అభియాన్ భారత్‌, ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన పథకాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.
 
వీటి అమలుకు నిధుల కేటాయింపు ఉంటుందని, ఇతర కొత్త పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో అనుమతించమని స్పష్టం చేసింది. ఇకపై కొత్త పథకాల కోసం ఆర్థిక శాఖకు ఎలాంటి ప్రతిపాదనలు పంపవద్దని అన్ని మంత్రిత్వ శాఖలకు లేఖ ద్వారా సమాచారం అందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments