Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్సైజ్ సుంకం తగ్గింపు : హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ఎంత?

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (08:53 IST)
కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా పెట్రోల్, డీజల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై రూ.5, డీజల్‌పై రూ.10 చొప్పున తగ్గించాయి. దీంతో వాహనదారులకు స్వల్పంగా ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ తగ్గించిన ఎక్సైజ్‌ గురువారం ఉదయం నుంచి అమలులోకి వచ్చింది. 
 
మరో వైపు ఎక్సైజ్‌ సుంకంపై రాష్ట్రం విధించిన వ్యాట్‌ కూడా తగ్గింది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌పై రూ.6.33, డీజిల్‌పై రూ.12.79 వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.18, లీటర్‌ డీజిల్‌ రూ.94.61కు చేరింది. 
 
గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా ఇంధర ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరాయి. లీటర్‌ పెట్రోల్‌ మధ్యప్రదేశ్‌లో రూ.120 దాటగా.. లీటర్‌ డీజిల్‌ రూ.110 వరకు చేరింది. ఈ క్రమంలో అన్నివర్గాలు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో దీపావళి సందర్భంగా కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments