Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్సైజ్ సుంకం తగ్గింపు : హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ఎంత?

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (08:53 IST)
కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా పెట్రోల్, డీజల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై రూ.5, డీజల్‌పై రూ.10 చొప్పున తగ్గించాయి. దీంతో వాహనదారులకు స్వల్పంగా ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ తగ్గించిన ఎక్సైజ్‌ గురువారం ఉదయం నుంచి అమలులోకి వచ్చింది. 
 
మరో వైపు ఎక్సైజ్‌ సుంకంపై రాష్ట్రం విధించిన వ్యాట్‌ కూడా తగ్గింది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌పై రూ.6.33, డీజిల్‌పై రూ.12.79 వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.18, లీటర్‌ డీజిల్‌ రూ.94.61కు చేరింది. 
 
గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా ఇంధర ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరాయి. లీటర్‌ పెట్రోల్‌ మధ్యప్రదేశ్‌లో రూ.120 దాటగా.. లీటర్‌ డీజిల్‌ రూ.110 వరకు చేరింది. ఈ క్రమంలో అన్నివర్గాలు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో దీపావళి సందర్భంగా కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments