Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎఫ్ ఖాతాదారులకు ఊరట.. రూ.7 లక్షల వరకు బీమా

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (19:19 IST)
కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. దీంతో ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనం కలుగనుంది. గతంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అందించే బీమా మొత్తాన్ని పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. 
 
ఇకపై పీఎఫ్ ఖాదారులకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.7 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఇది వరకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.6 లక్షల బీమా కవరేజ్ లభించేది. 2020 సెప్టెంబర్ 9న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు ఈపీఎఫ్ఓ చెందిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ CBT ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ EDLI బీమా మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 
 
అయితే ఈ నిర్ణయం అప్పటి నుంచి అమలులోకి రాలేదు. అయితే ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ బీమా కవరేజ్ మొత్తాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చిందని తెలిపారు. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించి ఒక నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments