Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాతాదారులకు షాకిచ్చిన ఈపీఎఫ్ - 40 యేళ్ళ కనిష్టానికి...

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (15:03 IST)
ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) తన ఖాతాదారులకు తేరుకోలేని విధంగా షాకిచ్చింది. ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లను 8.5 శాతం నుంచి 8.1 శాతానికి గణనీయంగా తగ్గించింది. అంటే 16 యేళ్ల క్రితం ఉన్న వడ్డీ రేట్లపై ఇకపై అందివ్వనుంది. 2021-22 సంవత్సరానికిగాను 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
అంతకుముందు 8.5 శాతంగా ఉంది. తగ్గింపు నిర్ణయం వల్ల దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులపై ప్రభావంపడనుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ సంస్థ ఆదాయం రూ.76,768 కోట్లుగా ఉందని, అందుకే వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చిందని ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ మెంబర్ మైఖేల్ డయాస్ వెల్లడించారు. 
 
కాగా, గత 1977-78 తర్వాత ఇంత తక్కువగా వడ్డీని చెల్లించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ యేడాది పీఎఫ్‌పై 8 శాతం వడ్డీని చెల్లించారు. 2018-19, 2016-17లలో 8.65 శాతం చొప్పున వడ్డీని జమచేశారు. 2013-14, 2014-15లో 8.75 శాతం, 2015-16లో 8.8 శాతం చొప్పున చెల్లించారు. 
 
అయితే, కరోనా మహమ్మారి సమయంలో నగదు ఉపసంహరణలు పెరగడంతో చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము భారీగా తగ్గింది. దీంతో 2019-2020కిగాను 8.5 శాతానికి వడ్డీని తగ్గించారు. ఇపుడు దీన్ని 8.1 శాతంగా తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments