Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు దీపావళి ట్రేడింగ్.. సాయంత్రం ఓ గంట ప్రత్యేక ట్రేడింగ్ సెషన్

ఠాగూర్
శుక్రవారం, 1 నవంబరు 2024 (09:12 IST)
సాధారణంగా తెలుగు వారికి ఉగాది కొత్త సంవత్సరాది. అలాగే, దేశ ప్రజలందరికీ జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు క్యాలెండర్ ఇయర్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆర్థిక సంవత్సరం. 
 
ఏప్రిల్‌ 1 నుంచి ఆర్థిక సంవత్సరం ఎలా ప్రారంభమవుతుందో.. మార్కెట్లకు దీపావళితో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ దీపావళి నుంచి సంవత్‌ 2081 ఆరంభంకానుంది. గురువారమే దేశమంతా దీపావళి జరుపుకోగా.. శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌లు మూరత్‌ ట్రేడింగ్‌ నిర్వహించనున్నాయి. శుక్రవారం మార్కెట్లు పూర్తి స్థాయిలో పనిచేయవు. సాయంత్రం ఓ గంట పాటు మాత్రం ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ జరుగుతుంది. ఇంతకీ ఎందుకీ మూరత్‌ ట్రేడింగ్‌? ఏ సమయంలో జరుగుతుంది?
 
దీపావళి రోజున ఏదైనా పని ప్రారంభిస్తే విజయం వరిస్తుందన్నది భారతీయుల ప్రగాఢ విశ్వాసం. అదే తరహాలో స్టాక్‌ మార్కెట్‌లో ఈ పర్వదినం రోజు ట్రేడింగ్‌ చేస్తే.. వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందని చాలా మంది భావిస్తారు. ఆ నమ్మకంతోనే చాలా మంది మూరత్‌ ట్రేడింగ్‌లో పాల్గొనేందుకు మక్కువ చూపుతుంటారు. 
 
అందుకే ఈ ట్రేడింగ్ కోసం అనేక మంది అమిత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ట్రేడింగ్‌ జరగనుంది. ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్న వారికీ, కొత్తగా మార్కెట్లోకి రావాలనుకునే వారికీ ఇది ఎంతో ప్రత్యేకం. మంచి కంపెనీలను ఎంచుకొని, దీర్ఘకాలంపాటు అందులో కొనసాగినప్పుడు ఆశించిన లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments