Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్నారా..? ఐతే ఈ వార్త చదవాల్సిందే..

Webdunia
బుధవారం, 24 జులై 2019 (12:49 IST)
ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు తప్పకుండా ఈ వార్త చదవాల్సిందే. వేతనాలను పొందే వారు, వ్యాపారాల ద్వారా ఆదాయం పొందేవారు టాక్స్ ఆడిట్ నెట్ నుంచి ఈ ఏడాది ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ఎక్కువ సమయం వుంటుందని ఆదాయ పన్ను శాఖ తాజా ప్రకటనలో తెలిపింది.


ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్స్ (సీబీడీటీ) 2019-20 అసెస్‌మెంట్ ఇయర్ కోసం.. అసెస్‌మెంట్ కేటగిరీల కోసం ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు గడువు తేదీని ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించింది. 
 
అంతకుముందు ఈ తేదీ జూలై 31 వరకే పరిమితం అయ్యింది. ఈ తేదీలోపు ఐటీ రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంది. కానీ ఆ తేదీని నెలపాటు పొడిగిస్తూ సీబీడీటీ ప్రకటించింది. ఫైనాన్షియల్ ఇయర్ 19 కోసం టీడీఎస్ స్టేట్మెంట్ జారీ చేయడంలో జాప్యం కారణంగా గడువు పొడిగించాలని డిమాండ్లు రావడంతో సీబీడీటీ జూలై 31 వరకు పరిమితమై ఐటీ రిటర్న్ తేదీని ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని ఆదాయ పన్ను చట్టం 1961, సెక్షన్ 119 కింద అమలు చేస్తున్నట్లు సీబీడీటీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments