Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ నగరవాసులకు శుభవార్త.. జూన్ 8 నుంచి క్రూజ్ సర్వీస్

Webdunia
గురువారం, 5 మే 2022 (10:57 IST)
Cruise liners
విశాఖ నగరవాసులకు శుభవార్త. ఎంతో కాలంగా ఊరిస్తున్న క్రూజ్‌ సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఎంప్రెస్‌ అనే నౌక విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి తిరిగి విశాఖకు వస్తుంది. ఈ క్రూయిజ్‌ నౌకకు అనుమతులిచ్చినట్టు విశాఖ నౌకాశ్రయం చైర్మన్‌ కే రామమోహనరావు వెల్లడించారు. టికెట్ల విక్రయాలతో నౌకాశ్రయానికి సంబంధం లేదని తెలిపారు.
 
ఈ నౌకా విహార సర్వీసు నిర్వహణపై నౌకాశ్రయ అధికారులు, జేఎం బక్షీ సంస్థ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చేనెల 8న సర్వీసు మొదలవుతుంది. తర్వాత 15, 22 తేదీల్లో కూడా విహారయాత్రలుంటాయి. ఇంటీరియర్‌ స్టాండర్డ్‌ రూం, ఓషన్‌ వ్యూ స్టాండర్డ్‌ రూం, మినీ సూట్‌ రూం పేరిట నాలుగు విభాగాలు నౌకలో ఉన్నాయి.
 
ఒక్కో విభాగానికి ఒక్కో ధర ఉంటుంది. ఈ నౌకలో అబ్బురపరిచే పలు వసతులు, రెస్టారెంట్లు, క్యాసినో అందుబాటులో ఉంటాయి. ఈ క్రూజ్ నౌక 1,500 నుంచి 1,800 మందితో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగివుంటుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments