Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేల నోటు ముద్రణ నిలిపివేత : మంత్రి అనురాగ్ ఠాగూర్

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (19:42 IST)
దేశంలో అతిపెద్ద కరెన్సీగా ఉన్న రెండు వేల రూపాయల నోటు ముద్రణను నిలిపివేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ వెల్లడించారు. గత 2019 నుంచి ఈ నోట్లను ముద్రించడం లేదని చెప్పారు. 
 
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టిన తర్వాత అవినీతి నిర్మూనలో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకువచ్చింది. మునుపెన్నడూ లేనివిధంగా రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. 
 
అయితే కొద్దికాలానికే వీటి లభ్యత తగ్గిపోయింది. తాజాగా ఈ అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది. 2019 ఏప్రిల్ నుంచి రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడంలేదని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
 
ఈ నోట్లను పెద్ద ఎత్తున దాచుకోవడంతో పాటు, నల్లడబ్బు రూపేణా విపణిలో చలామణీ చేసే అవకాశం ఉందని... అందుకే ఈ నోట్ల ముద్రణను రెండేళ్లుగా నిలిపివేసినట్టు వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చించిన మీదటే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
 
కాగా, 2018 మార్చి 30 నాటికి దేశంలో 3,362 మిలియన్ల రూ.2000 నోట్లు చలామణీలో ఉండగా... 2021 ఫిబ్రవరి నాటికి కేవలం 2,499 మిలియన్ల రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నట్టు గుర్తించామని మంత్రి అనురాగ్ ఠాగూర్ లోక్‌సభలో ఓ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహన్‌బాబు ఇంట్లో రూ.10లక్షలు చోరీ.. వ్యక్తి అరెస్ట్.. తిరుపతిలో పట్టుకున్నారు..

ఎర్రటి అంచు ఉండే తెల్లచీర కట్టుకుంటా.. చైతూతో పిల్లలు కనాలి: శోభిత

ఎన్ కౌంటర్ అంటే మనిషిని హత్యచేయడమేనా? వేట్టైయాన్ ప్రివ్యూలో అమితాబ్ ప్రశ్న

రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజ‌ర్‌ నుంచి రా మ‌చ్చా మ‌చ్చా ప్రోమో

క సినిమా మాకు జీవితాంతం గుర్తుండే అనుభవాలు ఇచ్చింది : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments