భారత్ దెబ్బకు టర్కీ కంపెనీ సెలెబీ షేరుకు పగటిపూటే చుక్కలు కనిపిస్తున్నాయ్..

ఠాగూర్
శుక్రవారం, 16 మే 2025 (17:35 IST)
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపింది. ఇందుకోసం పాకిస్థాన్‌‍తో పాటు పాక్ ప్రేరిపిత ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ ప్రతిదాడులకు దిగింది. అదేసమయంలో పాకిస్థాన్‌కు టర్కీ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించింది. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్థాన్‌కు డ్రోన్లతో పాటు సైనికులను కూడా పంపించింది. ఇది భారత్‌కు ఆగ్రహం తెప్పించింది. టర్కీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, టర్కీకి వాణిజ్యపరంగా ఎదురుగాలివీస్తోంది. టర్కీ సంస్థలతో భారత్ సంస్థలు, వర్శిటీలు సంబంధాలు తెంచుకుంటున్నాయి. ఇలా భారత్ ఎఫెక్ట్ పడిన టర్కీ కంపెనీల్లో సెలెబీ సంస్థ కూడా ఒకటి. ఇది భారత విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించండి. 
 
భారత ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం టర్కీకి చెందిన సెలెబీ ఏవియేషన్ హోల్డింగ్ సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ దెబ్బకు ఇస్తాంబుల్ స్టాక్ మార్కెట్‌లో మే 16న కంపెనీ షేరు ఏకంగా పది శాతం కుప్పకూలిపోయింది. గత నాలుగు వాణిజ్య పనిరోజుల్లోనే ఈ సంస్థ షేరు దాదాపు 30 శాతం మేరకు ఆవిరైపోయింది. భారత్‌లోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలను సెలిబీ అనుబంధ సంస్థ అందిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం