Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం రాత్రి 150 నిమిషాల పాటు ఎస్‌బిఐ బ్యాంకు సేవలకు అంతరాయం

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (08:23 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు సేవలు కొన్ని నిమిషాల పాటు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలకు 150 నిమిషాల పాటు అంతరాయం కలుగనుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న తమ 42 కోట్ల మంది బ్యాంకు ఖాతాదారులను అలర్ట్ జారీ చేసింది. 
 
ఆన్‌‌లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ సేవలు శుక్రవారం రాత్రి 150 నిమిషాల పాటు నిలిచిపోనున్నట్లు పేర్కొంది. జూలై 16 రాత్రి 10:45 నుంచి జూలై 17 ఉదయం 1.15 గంటల వరకు 150 నిమిషాలపాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేసుకోలేరని భారతీయ స్టేట్ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కస్టమర్లు ఈ సమయంలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోవడం మంచిది. కొత్త ఫీచర్స్‌ను అప్‌డేట్ చేసేందుకు ఎస్‌బీఐ మెయింటెన్స్ కార్యకలాపాలు చేపట్టినందున.. ఈ సమయంలో కస్టమర్లు లావాదేవీలు చేసేందుకు ప్రయత్నిస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశాలున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments