Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం రాత్రి 150 నిమిషాల పాటు ఎస్‌బిఐ బ్యాంకు సేవలకు అంతరాయం

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (08:23 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు సేవలు కొన్ని నిమిషాల పాటు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలకు 150 నిమిషాల పాటు అంతరాయం కలుగనుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న తమ 42 కోట్ల మంది బ్యాంకు ఖాతాదారులను అలర్ట్ జారీ చేసింది. 
 
ఆన్‌‌లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ సేవలు శుక్రవారం రాత్రి 150 నిమిషాల పాటు నిలిచిపోనున్నట్లు పేర్కొంది. జూలై 16 రాత్రి 10:45 నుంచి జూలై 17 ఉదయం 1.15 గంటల వరకు 150 నిమిషాలపాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేసుకోలేరని భారతీయ స్టేట్ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కస్టమర్లు ఈ సమయంలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోవడం మంచిది. కొత్త ఫీచర్స్‌ను అప్‌డేట్ చేసేందుకు ఎస్‌బీఐ మెయింటెన్స్ కార్యకలాపాలు చేపట్టినందున.. ఈ సమయంలో కస్టమర్లు లావాదేవీలు చేసేందుకు ప్రయత్నిస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశాలున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments