Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ పెట్రోల్ 52 రూపాయలే... ఎగబడికొంటున్న జనం!

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ.. వినియోగదారులకు చీమకుట్టినట్టయినా లేదు.

Webdunia
మంగళవారం, 8 మే 2018 (16:05 IST)
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ.. వినియోగదారులకు చీమకుట్టినట్టయినా లేదు.
 
అయితే అస్సాంలోని భారత్- భూటాన్ సరిహద్దుకు సమీపంలో నివసించే కొందరు ప్రజలు మాత్రం ఈ పెట్రో మంట నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అస్సాంలో లీటర్ పెట్రోల్ ధర 76 రూపాయలు. అదే భూటాన్‌లో అయితే 52 రూపాయలు. 
 
అంటే అస్సాంతో పోలిస్తే భూటాన్‌లో లీటర్ పెట్రోల్‌ 24 రూపాయలు తక్కువకే దొరుకుతోంది. దీంతో భూటాన్‌లోని సంద్రుప్ జాంగ్‌ఖర్ అనే పట్టణానికి సరిహద్దుకు సమీపంలో ఉన్న భారతీయులు క్యూ కడుతున్నారు. రోజుకు కొన్ని వందల మంది పెట్రోల్ కోసం భూటాన్‌ బాట పడుతున్నారు.
 
పెట్రోల్ ఒక్కటే కాదు డీజిల్ కూడా దాదాపు 20 రూపాయలు తక్కువ ధరకే లభ్యమవుతుందట. అంతేకాదు, మద్యం కూడా 20 రూపాయలు తక్కువకే దొరుకుతుండటంతో మందుబాబులు ఎగబడి కొనుక్కుంటున్నారట. భూటాన్ కరెన్సీ గుల్ట్రం కూడా భారతీయ కరెన్సీ రూపాయి విలువకు దాదాపు సమానంగా ఉండటంతో సరిహద్దు వాసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. దీంతో పెట్రోల్ కొనుగోలు చేసేందుకు భూటాన్ దేశానికి క్యూకడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments