Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ పెట్రోల్ 52 రూపాయలే... ఎగబడికొంటున్న జనం!

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ.. వినియోగదారులకు చీమకుట్టినట్టయినా లేదు.

Webdunia
మంగళవారం, 8 మే 2018 (16:05 IST)
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ.. వినియోగదారులకు చీమకుట్టినట్టయినా లేదు.
 
అయితే అస్సాంలోని భారత్- భూటాన్ సరిహద్దుకు సమీపంలో నివసించే కొందరు ప్రజలు మాత్రం ఈ పెట్రో మంట నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అస్సాంలో లీటర్ పెట్రోల్ ధర 76 రూపాయలు. అదే భూటాన్‌లో అయితే 52 రూపాయలు. 
 
అంటే అస్సాంతో పోలిస్తే భూటాన్‌లో లీటర్ పెట్రోల్‌ 24 రూపాయలు తక్కువకే దొరుకుతోంది. దీంతో భూటాన్‌లోని సంద్రుప్ జాంగ్‌ఖర్ అనే పట్టణానికి సరిహద్దుకు సమీపంలో ఉన్న భారతీయులు క్యూ కడుతున్నారు. రోజుకు కొన్ని వందల మంది పెట్రోల్ కోసం భూటాన్‌ బాట పడుతున్నారు.
 
పెట్రోల్ ఒక్కటే కాదు డీజిల్ కూడా దాదాపు 20 రూపాయలు తక్కువ ధరకే లభ్యమవుతుందట. అంతేకాదు, మద్యం కూడా 20 రూపాయలు తక్కువకే దొరుకుతుండటంతో మందుబాబులు ఎగబడి కొనుక్కుంటున్నారట. భూటాన్ కరెన్సీ గుల్ట్రం కూడా భారతీయ కరెన్సీ రూపాయి విలువకు దాదాపు సమానంగా ఉండటంతో సరిహద్దు వాసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. దీంతో పెట్రోల్ కొనుగోలు చేసేందుకు భూటాన్ దేశానికి క్యూకడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments