Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ పెట్రోల్ 52 రూపాయలే... ఎగబడికొంటున్న జనం!

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ.. వినియోగదారులకు చీమకుట్టినట్టయినా లేదు.

Webdunia
మంగళవారం, 8 మే 2018 (16:05 IST)
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ.. వినియోగదారులకు చీమకుట్టినట్టయినా లేదు.
 
అయితే అస్సాంలోని భారత్- భూటాన్ సరిహద్దుకు సమీపంలో నివసించే కొందరు ప్రజలు మాత్రం ఈ పెట్రో మంట నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అస్సాంలో లీటర్ పెట్రోల్ ధర 76 రూపాయలు. అదే భూటాన్‌లో అయితే 52 రూపాయలు. 
 
అంటే అస్సాంతో పోలిస్తే భూటాన్‌లో లీటర్ పెట్రోల్‌ 24 రూపాయలు తక్కువకే దొరుకుతోంది. దీంతో భూటాన్‌లోని సంద్రుప్ జాంగ్‌ఖర్ అనే పట్టణానికి సరిహద్దుకు సమీపంలో ఉన్న భారతీయులు క్యూ కడుతున్నారు. రోజుకు కొన్ని వందల మంది పెట్రోల్ కోసం భూటాన్‌ బాట పడుతున్నారు.
 
పెట్రోల్ ఒక్కటే కాదు డీజిల్ కూడా దాదాపు 20 రూపాయలు తక్కువ ధరకే లభ్యమవుతుందట. అంతేకాదు, మద్యం కూడా 20 రూపాయలు తక్కువకే దొరుకుతుండటంతో మందుబాబులు ఎగబడి కొనుక్కుంటున్నారట. భూటాన్ కరెన్సీ గుల్ట్రం కూడా భారతీయ కరెన్సీ రూపాయి విలువకు దాదాపు సమానంగా ఉండటంతో సరిహద్దు వాసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. దీంతో పెట్రోల్ కొనుగోలు చేసేందుకు భూటాన్ దేశానికి క్యూకడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments