Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

కాంగోలో ఘోర రైలు ప్రమాదం.. 33మంది మృతి.. భోగీల్లో నిప్పంటుకోవడంతో?

నవంబర్ 13 2017.. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి సంఖ్య అధికమవుతోంది. రాష్ట్రంలోని కృష్ణానదిలో బోటు మునిగిన ఘటన ఓ వైపుంటే.. ఇరాన్-ఇరాక్‌లలో చోటుచేసుకున్న భారీ భూకంపంతో 150 మంద

Advertiesment
Congo train
, సోమవారం, 13 నవంబరు 2017 (14:46 IST)
నవంబర్ 13 2017.. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి సంఖ్య అధికమవుతోంది. రాష్ట్రంలోని కృష్ణానదిలో బోటు మునిగిన ఘటన ఓ వైపుంటే.. ఇరాన్-ఇరాక్‌లలో చోటుచేసుకున్న భారీ భూకంపంతో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కాంగోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బోగీలకు నిప్పు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 
 
ఈ ప్రమాదంలో 33మంది మృతి చెందారు.. మరో 26 మంది తీవ్రగాయాలకు గురైయ్యారు. సంఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది... అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. బోగీల్లో అక్రమ రవాణా జరిగిందని.. అందుకే ఆయిల్ టాంకర్లకు నిప్పంటుకుని ఈ ప్రమాదం జరిగి వుంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆత్మకు శాంతి చేకూరాలని చెపితే సరిపోతుందా? జరిగిన నష్టం పూడ్చలేనిది : పవన్