Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా? ఉచితంగా ఆహారం తీసుకోవచ్చు..?

ట్రాఫిక్‌ ఇరుక్కున్న వారిని ఓ పెట్రోల్ బంకు ఆహారం ఏర్పాటు చేసింది. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుందే కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ ట్రాఫిక్ కారణంగా గంటల తరబడి.. రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఏ

ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా? ఉచితంగా ఆహారం తీసుకోవచ్చు..?
, సోమవారం, 4 సెప్టెంబరు 2017 (13:59 IST)
ట్రాఫిక్‌ ఇరుక్కున్న వారిని ఓ పెట్రోల్ బంకు ఆహారం ఏర్పాటు చేసింది. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుందే కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ ట్రాఫిక్ కారణంగా గంటల తరబడి.. రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వారికి అన్నపానీయాలు కరువయ్యాయి. దీన్ని గమనించిన ఓ ప్రెట్రోల్ బంకు  ఓ ఆఫర్ ప్రకటించింది. వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకు బంకుకు వచ్చే వారి కోసం ఆహారం ఏర్పాటు చేసింది. ఈ బంక్ బెంగళూరులోని ఇందిరానగర్‌లో వుంది.  
 
ఇందిరానగర్‌లోని ఆర్‌టీఓ సమీపంలోని వెంకటేశ్వర సర్వీస్ స్టేషన్ ఐఓసీ సౌజన్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ సేవలపై ఈ సర్వీస్ స్టేషన్ యజమాని ప్రకాష్ రావు మాట్లాడుతూ.. ట్రాఫిక్‌లో ఇబ్బందిపడే వారు తమ బంకుకు పెట్రోల్ నింపేందుకు వస్తే వారికి, బంక్‌లో 24 గంటలూ అన్నపానీయాల ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో భాగంగా శాకాహార, మాంసాహార వంటకాలను అందిస్తామని.. తమకు నచ్చిన ఆహారాన్ని ఉచితంగా పార్సిల్ చేసుకెళ్లవచ్చునని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సునామీలో నీట మునిగింది.. రోమ్ నగరంలో బయటపడిన తునిసియా (video)