Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో సమృద్ధి మేళాను నిర్వహిస్తోన్న యాక్సిస్‌ బ్యాంక్‌

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (20:50 IST)
భారతదేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, తమ బ్యాంకు అందించే పలు ఋణావకాశాలు, పథకాలను గురించి నెటిజన్లకు అవగాహన కల్పించే లక్ష్యంతో సమృద్ధి మేళాను నిర్వహిస్తోంది. ఈ మేళాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 8 యాక్సిస్‌ బ్యాంక్‌ శాఖల వద్ద నిర్వహిస్తోంది.


ఈ కార్యక్రమం ద్వారా బ్యాంక్‌ గ్రామాలు, పట్టణాలలోని వినియోగదారులకు విభిన్నమైన ఋణాలైనటువంటి వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య వాహన, ద్విచక్ర, ట్రాక్టర్‌, గృహ, బంగారం తదితర ఋణాల పట్ల అవగాహన కలిగిస్తోంది. ఈ సమృద్ధి మేళాను 10 రోజుల పాటు ఆగస్టు 17, 2022వ తేదీ నుంచి నిర్వహిస్తోంది. ఈ మేళాలను ఆంధ్రప్రదేశ్‌లో బాపట్ల, చీరాల, వినుకొండ, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, అద్దంకి, గురజాలలలో నిర్వహిస్తున్నారు.

 
తమ అవగాహన కార్యక్రమాలను మరింతగా విస్తరిస్తూ, బ్యాంక్‌ ఉద్యోగులు గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యక్రమాలు, మార్కెట్‌ యార్డులు/మండీలు/హాత్స్‌ మొదలైనవి సైతం సందర్శించడంతో పాటుగా అందుబాటులోని ఆర్ధిక పరిష్కారాలను గురించి అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బ్యాంక్‌ తమ భారత్‌ బ్యాంకింగ్‌ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటుగా టియర్‌ 4, 5 నగరాలలో అధిక సంఖ్యలో వినియోగదారులకు చేరుకోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments