Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఏటీఎం‌లు మూడు రోజులు మూసివేత? ఫ్యాక్ట్ చెక్!!

ఠాగూర్
శుక్రవారం, 9 మే 2025 (12:14 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం తీవ్రతరమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో రకరకాలైన వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇవి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ వార్త ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇండోపాక్ నేపథ్యంలో వచ్చే మూడు రోజుల పాటు ఏటీఎంలు మూతపడనున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ర్యాన్స‌మ్‌వేర్ సైబర్ దాడి జరగొచ్చని, అందుకే రెండు నుంచి మూడు రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఏటీఎంలను మూసివేస్తున్నట్టు ఆ న్యూస్ సారాంశం. ఈ మేరకు ఓ సందేశం ఇపుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. 
 
అయితే, దీనిని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ చేసి క్లార్టిటీ ఇచ్చింది. అది పూర్తిగా నకిలీ న్యూస్ అని తేల్చింది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. ఏటీఎంలు ఎప్పటిలాగానే పని చేస్తాయని వెల్లడించింది. ఎవరూ కూడా ఎలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయొద్దని, అస్సలు నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించింది. ఇందుకు సంబంధించి వాట్సాప్‍లో షేర్ అవుతున్న ఫేక్ మెసేజ్‌ను కూడా షేర్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments