Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేల నోటును రద్దు చేయం : విత్తమంత్రి జైట్లీ

దేశంలో మరోమారు పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేయబోతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, రూ.1000 నోటు స్థానంలో భారత రిజర్వు బ్యాంకు రూ.2000 నోటును ప

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (12:14 IST)
దేశంలో మరోమారు పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేయబోతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, రూ.1000 నోటు స్థానంలో భారత రిజర్వు బ్యాంకు రూ.2000 నోటును ప్రవేశపెట్టింది.
 
ప్రస్తుతం ఈ నోటు ముద్రణను ఆర్బీఐ పూర్తిగా నిలిపివేసిందనీ, అందువల్ల ఈ నోటును రద్దు చేయవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఓ నివేదికలో పేర్కొంది. దీంతో రూ.2 వేల నోటు రద్దు ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారంతో దేశ వ్యాప్తంగా మరోమారు అలజడి చెలరేగింది.
 
దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఈ వార్తలన్నీ అవాస్తవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనలు వెలువడితే తప్ప ఇలాంటి విషయాలను నమ్మరాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏ ఒక్కరూ నమ్మరాదనీ ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments