Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'చిల్లార్‌'ను చిల్లరగా పోల్చుతూ శశిథరూర్ చిల్లర ట్వీట్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 17 యేళ్ళ తర్వాత విశ్వసుందరిగా అవతరించిన మానస చిల్లర్‌ను చిల్లరతో పోల్చుతూ ట్వీట్ చేశారు. ఇది వివాదాస్పదమైంది.

Advertiesment
Shashi Tharoor
, సోమవారం, 20 నవంబరు 2017 (09:45 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 17 యేళ్ళ తర్వాత విశ్వసుందరిగా అవతరించిన మానస చిల్లర్‌ను చిల్లరతో పోల్చుతూ ట్వీట్ చేశారు. ఇది వివాదాస్పదమైంది. దీనిపై నెటిజన్లు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తంచేసింది. 
 
శశిథరూర్ తన ట్వీట్‌లో ఏమని పేర్కొన్నారంటే.. "పెద్ద నోట్లను రద్దుచేసి ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసిందో ఇప్పటికైనా గుర్తెరిగితే మంచిది. మన ‘చిల్లర’కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ‘చిల్లర్’ ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడంతో రుజువైంది’’ అని మానుషి చిల్లార్‌ను చిల్లరగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు.
 
దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన మానుషి చిల్లార్‌ను చిల్లర వ్యక్తిగా పోల్చిన శశిథరూర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. తాను చిల్లర వ్యక్తినని ఆయన మరోమారు తన వ్యాఖ్యలతో నిరూపించుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టినట్టు ఉన్నాయని కొందరు కామెంట్ చేశారు. 
 
మానుషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శశిథరూర్‌పై జాతీయ మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మానుషి విజయాన్ని తక్కువ చేసిన థరూర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆయనకు సమన్లు జారీ చేయాలని నిర్ణయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలోనే ఫస్ట్ టైం : రెండో కాన్పులో ఇద్దరు.. మూడోసారి ముగ్గురు