Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఆదివారం నుంచి దేశీయ విమాన సర్వీసులు

Webdunia
సోమవారం, 11 మే 2020 (20:21 IST)
కరోనా లాక్డౌన్‌‌ను కేంద్రం దశలవారీగా ఎత్తివేస్తోంది. ఇప్పటికే అనేక అంశాల్లో సడలింపులు ఇచ్చిన కేంద్రం.. మంగళవారం నుంచి ప్రత్యేక రైలు సర్వీసులు అనుమతినిచ్చింది. అలాగే ఆదివారం నుంచి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ యోచిస్తోంది. 
 
ఈ మేరకు సోమవారం ఉదయం పౌరవిమానయాన డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయంతోపాటు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ అధికారులు పలు నగరాల్లోని విమానాశ్రయాలను తనిఖీచేశారు. వాణిజ్యపరంగా విమానాలు నడిపేందుకు ఉన్న అవకాశాలను ఈ బృందం పరిశీలించినట్లు తెలుస్తున్నది. 
 
తొలి విడతలో భాగంగా తక్కువ దూరం ఉన్న ప్రాంతాలకు విమానాలు నడిపితే బాగుంటుందన్న సూచనలు కూడా అందాయి. రెండు గంటల వ్యవధి గల ప్రయాణాలకు ఎలాంటి భోజన సదుపాయం కల్పించకుండా విమానాలు నడుపవచ్చునని యోచిస్తున్నట్టు సమాచారం. 
 
అయితే, విమాన ప్రయాణికులు మాత్రం ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకొంటేనే ప్రయాణానికి అనుమతించాలన్న మరో సూచన కూడా అందినట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే తొలుత ఐటీ సెక్టార్‌ నగరాలు అయిన ముంబై, హైదరాబాద్‌, బెంగళూరుకు విమానసర్వీసులు నడపేలా చర్యలు తీసుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments