Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీవీఐపీల ప్రయాణం కోసం బోయింగ్777... మరికొన్ని గంటల్లో ల్యాండింగ్

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (15:04 IST)
దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి వంటి వీవీఐపీలు ప్రయాణించేందుకు వీలుగా బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌ను భారత్ కొనుగోలుచేసింది. దీనికి ఎయిరిండియా వన్ అనే పేరు పెట్టారు. దీన్ని అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసింది. ఈ అత్యాధునిక బీ777 విమానం మరికొన్ని గంటల్లో భారత గడ్డను ముద్దాడనుంది. 
 
నిజానికి ఈ విమానాన్ని ఎయిర్ ఇండియా సంస్థకు బోయింగ్ కంపెనీ గత ఆగస్టులోనే అందించాల్సి ఉండగా... కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది ఆలస్యమైంది. కాసేపట్లో ఈ విమానం ఢిల్లీలో ల్యాండ్ కానుంది. మరో విమానం కొన్ని రోజుల తర్వాత అందనుంది.
 
మరోవైపు వీవీఐపీల ప్రయాణ సమయాల్లో ఈ రెండు విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లుకాకుండా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు నడుపనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడుపుతున్నారు. 
 
అంతేకాదు ఇతర సమయాల్లో వాటిని కమర్షియల్ ఆపరేషన్లకు కూడా వినియోగిస్తున్నారు. కానీ, ఎయిరిండియా విమానాలను మాత్రం కేవలం వీవీఐపీల కోసం మాత్రమే వినియోగించనున్నారు. అందుకే ఇకపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు మాత్రమే ఇకపై ఈ విమానం నడుపనున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments