Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.80 వేల కోట్లతో 500 విమానాలు .. ఎయిరిండియా ప్లాన్

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (09:50 IST)
విమాన సర్వీసు దిగ్గజం ఎయిరిండియా దశ తిరగనుంది. ఈ సంస్థను టాటా కొనుగోలు చేసిన తర్వాత ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఎన్నో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తుంది. ఇందులోభాగంగా, తాజాగా మరో 500 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.80 వేల కోట్లను ఖర్చు చేయనుంది. ఈ విమానాలను బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి కొనుగోలు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తుంది. 
 
కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో 400 విమానాలను తక్కువ సీట్లు కలిగినవిగాను, మరో 100 విమానాలు భారీ సైజువి కొనుగోలు చేయనుంది. ఈ భారీ విమానాల్లో ఎయిర్‌బస్‌కు చెందిన 350 విమానాలతో బోయింగ్ సంస్థకు చెందిన 787, 777 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మహా కొనుగోలు ఒప్పందం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. అయితే, ఈ వార్తలపై ఎయిరిండియా అధికారిక ప్రకటన చేయాల్సివుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments