Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా యాజమాన్యంలో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు పసైందన విందు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (18:52 IST)
ఎయిర్ ఇండియాకు పూర్వవైభవం కల్పించేందుకు ఆ సంస్థ యాజమాన్యమైన టాటా గ్రూపు వివిధ రకాలైన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, పండగ సీజన్‌ సందర్భంగా దేశీయ విమాన సేవల్లో కొత్త ఆహార మెనూను ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తాజాగా ప్రకటన చేసింది. 
 
రుచికరమైన భోజనాలు, అధునాతన అపిటైజర్స్‌ (భోజనానికి ముందు ఇచ్చే పదార్థాలు), నాణ్యమైన డెజర్ట్స్‌ (భోజనానంతరం ఇచ్చే పదార్థాలు)ను కొత్త మెనూలో చేర్చినట్లు తెలిపింది. భారతీయ వంటకాలకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు తెలిపింది. 
 
ఈ కొత్త మెనూ అక్టోబరు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ప్రస్తుతానికి ఈ కొత్త మెనూను దేశీయ విమాన సర్వీసుల్లోనే అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది. త్వరలోనే అంతర్జాతీయ సేవలకు విస్తరిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా అంతర్గత సేవల విభాగం హెడ్ సందీప్ వర్మ తెలిపారు. 
 
కాగా, ఇటీవలే ఎయిర్ ఇండియా 'విహాన్‌.ఏఐ' పేరిట దీర్ఘకాలిక ప్రణాళికను ప్రకటించింది. రాబోయే అయిదేళ్లలో దేశీయ విమానయాన విపణిలో కనీసం 30 శాతం వాటా పొందడంతో పాటు అంతర్జాతీయ కార్యకలాపాల్లోనూ కీలక పాత్ర పోషించాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments