Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలకు హెల్మెట్ లేకుంటే పెట్రోల్ కట్ : యూపీ సీఎం యోగీ మార్క్ రూలింగ్

దేశంలో సంభవిస్తున్న రోడ్డు ప్రమాద మృతుల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులో ఉన్నారు. వీరిలో ఎక్కువగా హెల్మెట్ ధరించకుండా తలకు గాయాలై ప్రాణాలు కోల్పోయిన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో హెల్మెట్‌లు ధరించి వ

Webdunia
ఆదివారం, 21 మే 2017 (20:30 IST)
దేశంలో సంభవిస్తున్న రోడ్డు ప్రమాద మృతుల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులో ఉన్నారు. వీరిలో ఎక్కువగా హెల్మెట్ ధరించకుండా తలకు గాయాలై ప్రాణాలు కోల్పోయిన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో హెల్మెట్‌లు ధరించి వాహనం నడపాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయినా వినిపించుకునే నాథుడే లేడు. 
 
ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్... సరికొత్త నిబంధన విధించారు. హెల్మెట్ లేకపోతే పెట్రోల్ విక్రయించరాదని స్పష్టం చేశారు. ఈ నిబంధన యూపీలో సోమవారం నుంచి అమలుకానుంది. వాస్తవానికి తెలంగాణ సహా అనేక చోట్ల ఈ నిబంధన అమలు కోసం యత్నాలు జరిగాయి. అయితే పెట్రోల్ బంకుల నుంచి వ్యతిరేకత రావడంతో దీన్ని కొంతకాలం పాటు వాయిదా వేశారు. తమ అమ్మకాలు పడిపోతున్నాయని పెట్రోల్ బంకుల యజమానులు మొరపెట్టుకోవడంతో ఈ నిబంధనను అంత సీరియస్‌గా అమలు చేయడం లేదు.
 
అయితే కొత్తగా వచ్చిన యోగి రాజ్యంలో ఈ నిబంధన కాస్త కఠినంగానే అమలు చేయనున్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. దీంతో సోమవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments