Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ రెండుపూటలా స్నానం చేస్తే సరిపోదు... మరింకేం చేయాలి?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (21:02 IST)
ప్రతిరోజు రెండు పూటలా స్నానం, ముఖానికి సబ్బు, చర్మం కాంతివంతంగా ఉండడానికి ఓ మాయిశ్చరైజర్... ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలనుకుంటారు చాలామంది మహిళలు. అయితే వీటితో పాటు చర్మ సంరక్షణలో భాగంగా ముఖ్యమైనది మృత కణాలను తొలగించుకోవడం. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే చర్మం నిర్జీవంగా మారి కళ తప్పి పొడిబారినట్లవుతుంది. మరి వీటిని సహజమైన పదార్దాలను ఉపయోగించి ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. వేపాకుల్ని ముద్దలాగా చేసి కాస్త పెసరపిండి , చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి.  ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం నునుపుగా తయారవుతుంది.
 
2. ఒక చెంచా కొబ్బరి నూనె, ఒక చెంచా ఆలివ్ నూనె బాగా కలిపి ఇందులో మూడు చెంచాల చక్కెర కలిపి ముఖానికి మిగతా శరీరానికి రాసి కొన్ని నిముషాల పాటు మృదువుగా మర్దనా చేయాలి. పది నిముషాలు ఆగి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చక్కెర చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగిస్తుంది.
 
3. కొబ్బరినూనె  చర్మానికి కావలసిన తేమను, పోషణను అందిస్తుంది.
 
4. ఒక టీ స్పూన్ టమోటా రసంలో కొద్దిగా గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ బ్రూ పొడిని కలిపి ఫేస్టులా చేసి దానిని ముఖానికి పట్టించాలి. 15 నిమిషముల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇలా వారంలో రెండు రోజులు చేయడం వలన ముఖం పై ఉన్న ముడతలు తొలగిపోయి యవ్వనంగా కనిపిస్తారు. 
 
5. అరటిపండు ఆరోగ్యానికే కాకుండా మంచి సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. అరటిపండులో మాయిశ్చర్ అధికం. అరటిపండులో పొటాషియం, విటమిన్ సి, ఇ ఎక్కువుగా ఉంటాయి. అరటిపండుగుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి గంట తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. దీని వలన ముఖంపై ఉన్న నల్లమచ్చలు తొలగి చర్మం సున్నితంగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments