వేసవి ఎండలు ముదురుతున్నాయి... చర్మ సౌందర్యానికి చిట్కాలు...

ఎండలు బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలో సంభవించేటటువంటి మార్పులు ఎన్నో రకాల అనారోగ్యాలకు దారితీస్తాయి. ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గుల వల్ల ఆహారం తీసుకునే పద్ధతిలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఎండలో బాగా తిరిగే

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (21:40 IST)
ఎండలు బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలో సంభవించేటటువంటి మార్పులు ఎన్నో రకాల అనారోగ్యాలకు దారితీస్తాయి. ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గుల వల్ల ఆహారం తీసుకునే పద్ధతిలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఎండలో బాగా తిరిగే వారికి చర్మానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు కొన్ని చిట్కాల ద్వారా నివారించవచ్చు.
 
1. ఎండ ప్రభావం ముఖంపై ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ సమస్యను తొలగించుకోవాలంటే.... పచ్చిపాలలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. 
 
2. ఈ ఎండకాలంలో కొంత మంది ముఖంపై జిడ్డు ఎక్కువగా పేరుకుంటుంది. అలాంటి వారు ఒక టీ స్పూన్ నిమ్మరసంలో ఒక టీ స్పూన్ టమోటా రసాన్ని కలిపితే చక్కటి మాయిశ్చరైజర్ తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. నిమ్మరసంలో మరియు టమోటా రసంలో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చి జిడ్డును తొలగిస్తాయి. 
 
3. ఎండలో ఎక్కువగా తిరిగే వారు రాత్రి పడుకునే ముందు కలబంద గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకొని పడుకోవాలి. ఇది చర్మంలోని మృతకణాలను తొలగించటంతో పాటు మెరిసే చర్మాన్ని అందిస్తుంది. ఇలా క్రమంతప్పకుండా పది రోజులు చేయడం వల్ల ముఖం మృదువుగా, అందంగా మారుతుంది.
 
4. పాలలో కొద్దిగా శెనగపిండి, చిటికెడు పసుపు కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇది చర్మంలో ఉన్న మురికిని తొలగించి ముఖాన్ని మృదువుగా మారుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరంగల్ జంట హత్యల కేసు : ముద్దాయి మరణించేంత వరకు ఉరితీయండి.. కోర్టు తీర్పు

అవినీతి అధికారులను పట్టిస్తే రూ.లక్ష రివార్డు : సీఎం విజయ్ వెల్లడి

కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్నాడనీ యువకుడిని చంపి ముక్కలు చేసిన దంపతులు

అసలే ఎండలు.. చాలదన్నట్లు ఏపీ గోదావరి జిల్లాల్లో తాగునీటి కొరత.. అలా చేయకపోతే..?

అమరావతి: స్మార్ట్ క్యాపిటల్ సిటీ కార్యక్రమాలు.. గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా తీర్చిదిద్ధుతాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sunil Narang: తెలంగాణ వర్సెస్ ఆంధ్రా గా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వుందా?

NBK111 : నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో మనోజ్ మంచు

Manchu Manoj: వడ్డీ కాసుల వాడ గా రాబోతున్న మంచు మనోజ్

Chiru: స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎం. రుషికి అభినందనగా ల్యాప్‌టాప్ బహుకరించిన చిరంజీవి

ఇండస్ట్రీలో చెడు వాతావరణం కనిపించలేదు : పురుష: చిత్ర నిర్మాత కోటేశ్వరరావు

తర్వాతి కథనం
Show comments