Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిలో క్యాబేజీ ముక్కలు వేసి..?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (15:50 IST)
మండే ఎండల్లో చర్మ సంరక్షణకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఎండలో చర్మం కమిలినట్లయితే ముఖ్యంగా పొడిచర్మం కలిగినవారు పంచదార, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచు చేస్తుంటే చర్మ తాజాగా తయారవుతుంది. 
 
స్పూన్ బంగాళాదుంప రసం, స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు అప్లై చేసుకుని పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. రోజూ ఇలా చేస్తూనే ఉండాలి. అప్పుడే.. వేసవికాలంలో వచ్చే చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
కీరా రసంలో స్పూన్ చల్లని పాలు కలిపి ముఖచర్మానికి రాసి పావుగంట ఆగిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు రాయాలి. మూడు టేబుల్ స్పూన్ల పాలు, స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించి, కొద్దిసేపాగి కడుక్కుంటే ఫలితం ఉంటుంది. 
 
కొద్దిగా అలోవేరా ఆకులు తీసుకుని నలిపి, నిమ్మరసం కలిపి పేస్ట్ మాదిరి చేసి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారి మెరిసిపోతుంది. ఆలివ్ ఆయిల్ మసాజ్ వలన కూడా ఫలితం కనిపిస్తుంది. రెండు స్పూన్ల తేనె, నిమ్మరసం కలిపి కమిలిన చర్మంపై రాయాలి. దాంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
 
నీటిలో క్యాబేజీ ముక్కలు వేసి కాచి, నీటిని వడగట్టి, ముక్కల్ని గుజ్జులా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఆగిన తర్వాత కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేయాలి.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments