నిమ్మరసం, పాలు సమంగా కలిపి అక్కడ మృదువుగా మర్దన చేస్తే...

Webdunia
బుధవారం, 8 మే 2019 (22:20 IST)
కొందరిలో ముఖంపై మంగుమచ్చలు వచ్చి ముఖం అందవికారంగా ఉండడం వలన మానసిక వేదనను అనుభవిస్తుంటారు. అవి ప్రమాదకరమైనవి కాదు, ఒకరి నుండి మరొకరికి వ్యాపించవు. జన్యు సంబంధ కారాణాల వల్ల, సూర్యరశ్మి ప్రభావం వల్ల మరియు హార్మోన్ల ప్రభావం వల్ల ఈ మంగు మచ్చలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మనం వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే సరి.
 
1. నిమ్మరసం, పాలు సమంగా కలిపి మచ్చలపై మృదువుగా మర్దనా చేయాలి. అలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
 
2.గులాబీ పూల పొడిలో తగినంత నిమ్మరసం చేర్చి పట్టిస్తూ ఉన్నట్లయితే క్రమంగా మచ్చలు పోతాయి.
 
3.ఉసిరిక పెచ్చుల పొడి, పసుపు సమానంగా కలిపి సేవిస్తున్నా మంగు మచ్చలు తగ్గుముఖం పడతాయి.
 
4. రాత్రిపూట 50 మి.లీ నీటిలో ఒక గ్రాము వేప బెరడు పొడి వేసి ఉదయాన్నే వడకట్టి 5 మి.లీ తేనె కలుపుకుని తాగినట్లయితే మంగు మచ్చలకు మంచి ఔషధంలా పని చేస్తుంది.
 
5. ఒక భాగం శ్రీ గంధం పొడిలో దానికి రెట్టింపు బొప్పాయి గుజ్జుని చేర్చి బాగా కలిపి మంగు మచ్చలు ఉన్న చోట రాయాలి. ఇలా చేయడం వలన మంగు మచ్చలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

US Supermarket: భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు

అక్రమ వలసదారులకు బెంగాల్ సీఎం వార్నింగ్... వెళ్లిపోతారా.. వెళ్లగొట్టమంటారా?

బక్రీద్ పండుగ.. డిజిటల్ చెల్లింపుల ముసుగులో మోసం జాగ్రత్త.. సజ్జనార్

ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడిన ఎయిరిండియా బస్సు

మీనాక్షి అమ్మవారి ఆలయ కార్ పార్కింగ్‌ వద్ద 17ఏళ్ల బాలుడి హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments