Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీగడలో పసుపు కలిపి పాదాలకు పట్టిస్తే...?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:23 IST)
చలికాలంలో పాదాల సంరక్షణకు ఏం చేయాలంటే.. ప్రతిరోజూ పాదాలను చల్లని నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా చూసుకోవాలి. షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి. 
 
అలానే చెప్పులు లేకుండా నడవకూడదు. ఉతకని సాక్స్ ఎక్కువ రోజుల పాటు వేసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాదాలు పగుళ్లుగా ఉన్నప్పుడు బకెట్ నీటిలో కొద్దిగా వంటసోడా, ఉప్పు, నిమ్మరసం కలిపి ఆపై పాదాలు అందులో పెట్టి అరగంట పాటు అలానే ఉండాలి. తరువాత మెత్తని బట్టతో పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేయడం వలన పాదాలు పగుళ్లు తొలగిపోయి మృదువుగా తయారవుతాయి. 
 
నిమ్మ చెక్కలను ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. అందులో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి పాదాలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే పాదాలు కాంతివంతంగా మారుతాయి. కప్పు మీగడలో కొద్దిగా పసుపు, తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేయడం వలన పాదాలు తాజాగా మారుతాయి.   

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments