శీతాకాలం రాగానే మహిళల్లో చర్మం పగుళ్లు, పెదవులు పొడిబారడంతో పాటు పగుళ్లు సమస్య అధికమవుతుంది. అలాంటివారు ఈ చిట్కాలు పాటిస్తే చాలు.
ఆలివ్ ఆయిల్లో నిమ్మరసాన్ని కలిపి పెదాలకు రాయడం వల్ల పెదాలు పగలవు.
ఆలివ్ ఆయిల్తో తేనెను కలిపి ముఖానికి రాసి, కొంతసేపయిన తర్వాత ముఖాన్ని మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.
చర్మం పొడారిపోయినట్లుగా కళావిహీనంగా ఉంటే ఆలివ్ ఆయిల్లో పాలనుకానీ, పాలమీగడను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్చేసి, ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ ఏర్పడతాయి.