బియ్యం, నువ్వులు సమాన భాగాలుగా తీసుకుని రాత్రంతా నానబెట్టి....

Webdunia
గురువారం, 4 జులై 2019 (20:31 IST)
సాధారణంగా మన చర్మం రంగు ఎరుపా, చామనఛాయ అన్న విషయంతో సంబంధం లేకుండా అది ప్రకాశవంతంగా మెరుస్తుంటే చూసేకొద్దీ చూడాలని అనిపిస్తుంటుంది. అందుకే మనం చంర్మం మెరుపుని సంతరించుకోవడానికి అనేక రకములైన కాస్మోటిక్స్ వాడుతుంటాము. అలా చేయడం వలన సున్నితమైన చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాకాకుండా సహజసిద్దంగా లభించే పదార్దాలతో కొన్ని చిట్కాల ద్వారా మన చర్మాన్ని ప్రకాశవంతంగా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. బియ్యం, నువ్వులు సమాన భాగాలుగా తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. తరువాత రెండింటిని మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషముల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం తేమని సంతరించుకుని అందంగా మెరుస్తుంటుంది.
 
2. ముఖాన్ని శుభ్రంగా కడిగి తేనె, ముల్తానా మట్టి కలిపిన మిశ్రమాన్ని పట్టించి పావుగంట తరువాత కొద్దిగా నీళ్లు తీసుకుని మెల్లగా మర్దనా చేస్తూ రుద్ది కడిగేయాలి. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే క్రమంగా చర్మం మెరుపుని సంతరించుకుంటుంది.
 
3. కొవ్వు తక్కువగా ఉన్న పాలను తీసుకుని వాటిని ముఖానికి పలుచని పూతలా వేసి చర్మంలో కలిసిపోయేలా మృదువుగా మర్దనా చేయాలి. పది నిమిషముల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖం మీద ఉన్న మచ్చలన్నీ తొలగిపోయి ముఖం మృదువుగా ఉండి మెరుస్తుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంధ్ర ప్రజలకు హెచ్చరిక, ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్త

Annamalai: బీజేపీకి బైబై చెప్పనున్న అన్నామలై

పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ

రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారు

27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shalini: సింగ్ గీతం లో విలన్ క్యారెక్టర్ చేశాను. మాటే పాటగా మారే కథ ఇది : శాలిని కొండెపుడి

Sunitha: భానుచందర్, సునీత, సి కళ్యాణ్ ఆవిష్కరించిన కొత్త మలుపు ట్రైలర్

SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ కు వరల్డ్ రికార్డ్ గుర్తింపు దక్కింది

Janhvi Kapoor : సినిమా అనేది ప్రజలకు చేసే సేవ : జాన్వీ కపూర్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ చిత్రం ఇరుముడి గ్లింప్స్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments