పసుపుతో మెరిసే చర్మ సౌందర్యం మీ సొంతం... (video)

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (09:20 IST)
ఎక్కువ ధరలు చెల్లించి ఫేస్‌ప్యాక్‌లు, స్క్రబ్బర్‌లు వాడటం కంటే సహజసిద్ధంగా లభించే పసుపుని వాడటం మంచిదని బ్యూటీషియన్లు చెపుతుంటారు. పసుపు వాడకం వల్ల మెటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్‌ వంటి సమస్యలు తొలగిపోతాయి. పసుపుతో మాస్క్‌, స్క్రబ్బర్‌, ఫేస్‌ప్యాక్‌లను ఇంట్లోనే తయారు చేసుకుని మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు అంటున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం....
 
ముందుగా పసుపులో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. 
 
పసుపులో ఒక టీస్పూన్‌, మీగడ, శెనగపిండి కలిపి స్క్రబ్‌ తయారు చేసి, చేతి వేళ్ల చివర్లతో ముఖంపై సున్నితంగా మర్దనం చేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 
పసుపులో బియ్యపు పిండి, టొమాటో రసం, పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. తర్వాత ఈ మాస్క్‌ని ముఖానికి, మెడకు వేసుకుని అరగంటసేపు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. అంతే మెరిసే చర్మం మీ సొంతం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments