Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర టీస్పూన్ కొబ్బరినూనె, అర టీస్పూన్ బాదం నూనె కలిపి...

Beauty in Summer
Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (21:58 IST)
ఎండలో తిరిగినప్పుడు ముఖచర్మం కాంతివిహీనంగా తయారవుతుంది. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి అనేక రకములైన క్రీంలు వాడుతుంటాము. అందువల్ల చర్మం పాడయ్యి అనేక రకములైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాకాకుండా మనకు సహజసిద్దంగా మన ఇంట్లోనే లభించే కొన్ని పదార్దాలతోనే మన ముఖ చర్మాన్ని కాంతివంతంగా తయారుచేసుకోవచ్చతు. అదెలాగో చూద్దాం.
 
1. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టికి టేబుల్ స్పూన్ పాలు, టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్టులా చేయాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ పేస్టుని రాసి ఇరవై నిముషాల తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మీద ఉన్న మచ్చలన్నీ పోయి ఆరోగ్యంగా మెరుస్తుంది.
 
2. టేబుల్ స్పూన్ గంధం పొడిలో అర టీస్పూన్ కొబ్బరినూనె, అర టీస్పూన్ బాదం నూనె, టీస్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిముషాల తరువాత కడగాలి. లేదా రోజ్ వాటర్‌లో ముంచిన దూదితో ముఖం అంతా సుతిమెత్తగా అద్దాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
3. పసుపు, గంధం కలిపి రాసుకుంటే ముఖానికి అందం, ఆకర్షణ వస్తాయి.
 
4. చందనం, రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుని ఇరవై నిముషాల తరువాత కడిగివేయాలి. దానివల్ల చర్మం తాజాగా కనపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments