Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలోవెరా జెల్‌తో పగుళ్లు మాయం

పాదాల పగుళ్లను దూరం చేసుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి. గ్లిజరిన్, రోజ్ వాటర్‌తో కలిపి ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు.. అలా 15 రోజుల పాటు రాస్తే ఫలితం వుంటుంది. పగుళ్లు మాయమవుతాయి. కొవ్వొత్తి వ

Webdunia
ఆదివారం, 7 జనవరి 2018 (10:28 IST)
పాదాల పగుళ్లను దూరం చేసుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి. గ్లిజరిన్, రోజ్ వాటర్‌తో కలిపి ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు.. అలా 15 రోజుల పాటు రాస్తే ఫలితం వుంటుంది. పగుళ్లు మాయమవుతాయి. కొవ్వొత్తి వెలుగునివ్వడమే కాదు పాదాలకు ఓ రూపునిస్తుంది. మైనం ఆవనూనెతో కలిపి రాత్రి పూట పగుళ్లపై రాస్తే మంచి ఫలితం వుంటుంది. నువ్వుల నూనె కూడా ఈ సమస్య నివారణకు పనిచేస్తుందట. నిద్రించే ముందు పాదాలకు మర్ధన చేయాలి.
 
అరటి పండు గుజ్జు కూడా పగుళ్లపై మంచి ఔషధంగా పనిచేస్తుంది. పగుళ్లు తొందరగా మానిపోయేలా చేస్తుంది. పసుపు, తులసి, కర్పూరం సమాన మొత్తాల్లో తీసుకుని వీటికి అలోవెరా జెల్ కలిపి రాసి చూస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు. 
 
కొబ్బరి నూనెను దాదాపు అన్ని సమస్యలు నుండి ఉపశమనం కోసం ఉపయోగించవచ్చు. దీనిని పగిలిన పాదాలకు చికిత్స కోసం కూడా ఉపయోగించవచ్చు.  పాదాలపై నేరుగా కొబ్బరి నూనెను రాసుకుని, ఆపై సాక్స్ ధరించాలి. కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజర్ వలె పని చేసి, పగుళ్లు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇంకా, కొబ్బరి నూనె పాదాలపై మాత్రమే కాకుండా, లోపల పొరల్లోకి కూడా ప్రవేశించి, పాదాలకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments