‘నువ్వు దళితుడివే అయితే, దళితులకే పుడితే’... ఏపీ అసెంబ్లీలో మంత్రి మేరుగు నాగార్జున వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (14:08 IST)
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేరుగు నాగార్జున అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తనను, దళితులను కించపరిచేలా మేరుగు నాగార్జున మాట్లాడారని కొండేపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. అసెంబ్లీలో బీసీ స్టడీ సర్కిళ్ల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘నువ్వు దళితుడివే అయితే దళితులకే పుడితే చంద్రబాబు పంచ నుంచి బయటకు రా’ అంటూ మేరుగు నాగార్జున అన్నారు.

 
మేరుగు నాగార్జున చేసిన వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ తమ్మినేని సీతారంకు బాల వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పీకర్ వివరణ కోరగా తాను తప్పుగా ఏం మాట్లాడలేదని మేరుగు నాగార్జున అన్నారు. అయితే మంత్రి మాట్లాడిన రికార్డును బయటకు తీయాలని స్వామి స్పీకర్‌ను కోరారు. అలాగే మంత్రి మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ఫోను ద్వారా ప్లే చేసేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించగా స్పీకర్ అడ్డుకున్నారు.

 
మేరుగు నాగార్జున మాట్లాడిన రికార్డులను బయటకు తీయాలని స్వామి డిమాండ్ చేయగా తాను తరువాత చూసి చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments