Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘నువ్వు దళితుడివే అయితే, దళితులకే పుడితే’... ఏపీ అసెంబ్లీలో మంత్రి మేరుగు నాగార్జున వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (14:08 IST)
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేరుగు నాగార్జున అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తనను, దళితులను కించపరిచేలా మేరుగు నాగార్జున మాట్లాడారని కొండేపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. అసెంబ్లీలో బీసీ స్టడీ సర్కిళ్ల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘నువ్వు దళితుడివే అయితే దళితులకే పుడితే చంద్రబాబు పంచ నుంచి బయటకు రా’ అంటూ మేరుగు నాగార్జున అన్నారు.

 
మేరుగు నాగార్జున చేసిన వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ తమ్మినేని సీతారంకు బాల వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పీకర్ వివరణ కోరగా తాను తప్పుగా ఏం మాట్లాడలేదని మేరుగు నాగార్జున అన్నారు. అయితే మంత్రి మాట్లాడిన రికార్డును బయటకు తీయాలని స్వామి స్పీకర్‌ను కోరారు. అలాగే మంత్రి మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ఫోను ద్వారా ప్లే చేసేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించగా స్పీకర్ అడ్డుకున్నారు.

 
మేరుగు నాగార్జున మాట్లాడిన రికార్డులను బయటకు తీయాలని స్వామి డిమాండ్ చేయగా తాను తరువాత చూసి చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments