Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్: ‘మైనర్ బాలిక కిడ్నాప్, రేప్’

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (13:54 IST)
హైదరాబాద్ డబీర్‌ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్, రేప్ కేసు నమోదు అయింది. డబీర్ పురాకు చెందిన మైనర్ అమ్మాయిని ఇద్దరు యువకులు కలిసి, నాంపల్లిలోని ఒక లాడ్జీకి తీసుకెళ్లి రెండు రోజులు అత్యాచారం చేసినట్టుగా ప్రాథమికంగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ముందుగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్నారు. తరువాత అమ్మాయి ఆచూకీ కనిపెట్టారు. అప్పుడు అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం రేప్ కేసు కూడా పెట్టారు.

 
వెంటనే ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు. వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయ్యి, అమ్మాయిని విచారించిన తరువాత ఘటన పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. నిందితులు రెయిన్ బజార్ ప్రాంతానికి చెందిన వారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 
సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం లాడ్జీకి ఎవరూ బలవంతంగా తీసుకెళ్లలేదని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో కిడ్నాప్ కేసు, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. విచారణ పూర్తయిన తరువా పూర్తి వివరాలు తెలియజేస్తామని డబీర్ పుర ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర రావు తెలిపారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments