Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాంపల్లిలోని ఓయో లాడ్జ్‌కు తీసుకెళ్లి 16ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

gang rape
, గురువారం, 15 సెప్టెంబరు 2022 (10:54 IST)
పాతబస్తీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. 16ఏళ్ల బాలికపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 12న చంచల్‌గూడ జైలు సమీపంలో బాలికను కిడ్నాప్‌ చేసిన యువకులు.. నాంపల్లిలోని ఓయో లాడ్జ్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆమెకు మత్తు మందు ఇచ్చి రెండు రోజులపాటు సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం ఆ మైనర్‌ బాలికను అక్కడే వదిలివెళ్లిపోయారు.
 
ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డబీర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. నిందితులు బాధితురాలికి తెలిసినవారేనని పోలీసులు భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం