Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్: లక్షకు చేరువలో రోజువారి కేసులు, ఇలాగైతే మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదేమో!- Newsreel

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (12:45 IST)
గడిచిన 24 గంటలలో భారత్‌లో 89,129 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 6,58,909 యాక్టివ్‌ కేసులున్నట్లు పేర్కొంది. తాజా పెరుగుదలతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 7,30,54,295కు చేరుకుంది.

 
గత కొద్ది రోజులుగా కరోనా కేసు సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి 15 వేలుగా ఉన్న రోజువారి కేసుల సంఖ్య మార్చి 30 నాటికి 53వేలకు, ఏప్రిల్‌ 2వ తేదీనాటికి 89వేలకు చేరుకుంది.

 
మహారాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌?
ఇక దేశవ్యాప్తంగా దాదాపు సగం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. శుక్రవారంనాడు అక్కడ 47,828 కేసులు నమోదయ్యాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్‌ విధించక తప్పదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు.

 
రాష్ట్రంలో వ్యాక్సీన్‌ తీసుకున్న వారికి కూడా కోవిడ్‌ వ్యాపిస్తోందని, మాస్క్‌ ధరించకపోవడమే దీనికి కారణమని సీఎం అన్నారు. లాక్‌డౌన్‌ విధింపుపై కార్యాచరణ సిద్ధం చేయాలని గత ఆదివారమే ఉద్ధవ్‌ ఠాక్రే అధికారులకు సూచించారు. 

 
అయితే చాలాచోట్ల ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రజలు పాటించడం లేదు. పుణేలో ఇప్పటికే కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రార్ధనాలయాలు, హోటళ్లు, బార్లు షాపింగ్‌ కాంప్లెక్స్‌లను మూసేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments