Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడ్స్‌పై అవగాహన మహిళల్లోనే అధికం- ప్రెస్ రివ్యూ

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (12:39 IST)
ఎయిడ్స్‌ వ్యాధిపై పురుషులతో పోల్చితే మహిళల్లోనే అవగాహన పెరుగుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడయ్యిందని నమస్తే తెలంగాణ రాసింది.
 
నాలుగేండ్ల కిందటితో పోల్చితే ప్రస్తుతం ఎయిడ్స్‌పై మహిళలు అవగాహన పెంచుకోగా, పురుషుల్లో క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. తెలంగాణతో పాటు దేశంలోని మెజార్టీ రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. నిరోధ్‌ వాడకం వల్ల కలిగే ఉపయోగాల్లోనూ మహిళల్లో అవగాహన పెరిగింది. ఈ విషయంలోనూ పురుషుల్లో అవగాహన తగ్గుతున్నది. ఇలా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో అసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 15-49 మధ్య వయస్కుల వివరాలతో ఈ సర్వేను రూపొందించింది. ఎయిడ్స్‌పై మహిళలకు, పురుషులకు ఏ మేరకు అవగాహన ఉన్నది? నిరోధ్‌ వాడకం వల్ల ఎయిడ్స్‌ వ్యాధి సోకే తీవ్రతను తగ్గించవచ్చనే అంశంపై ఎంత మేరకు అవగాహన ఉన్నదనే అంశాలపై సర్వేలో పరిశీలన చేశారు.
 
ఎయిడ్స్‌పై అవగాహనను తెలంగాణలో పరిశీలిస్తే.. 2015-16లో 29.5 శాతం మంది మహిళలకు అవగాహన ఉంటే, 2019-20లో అది 30.7 శాతానికి పెరిగింది. అంటే నాలుగేండ్లలో 1.2 శాతం మంది మహిళలకు ఈ వ్యాధిపై అవగాహన పెరిగింది. పురుషుల విషయానికొస్తే 2015-16లో 50.1 శాతం మందికి అవగాహన ఉంటే, 2019-20కి వచ్చే సరికి 30.5 శాతానికి పడిపోయింది. నాలుగేండ్లలో ఏకంగా 19.6 శాతం మందికి ఎయిడ్స్‌పై అవగాహన తగ్గడం గమనార్హం. ఇక నిరోధ్‌ వాడకం వల్ల ఎయిడ్స్‌ బారిన పడకుండా రక్షించుకోవచ్చు అనే దానిపై అవగాహనను పరిశీలిస్తే.. 2015-16లో 59.1 శాతం మహిళలకు అవగాహన ఉంటే, 2019-20కి వచ్చే సరికి అది 68.9 శాతానికి పెరిగింది. పురుషుల విషయంలో 2015-16లో 81.5 శాతం మందికి దీనిపై అవగాహన ఉంటే, 2019-20కి వచ్చేసరికి 75.3 శాతానికి తగ్గడం గమనార్హం.
 
గ్రామాల్లో తక్కువ.. పట్టణాల్లో ఎక్కువ
గ్రామాలతో పోల్చితే పట్టణ మహిళలు, పురుషుల్లో ఎక్కువ అవగాహన ఉన్నది. అన్ని రాష్ర్టాల్లోనూ ఇలాగే ఉన్నది. తెలంగాణలో ఎయిడ్స్‌పై గ్రామీణ మహిళల్లో 26.9 శాతం మందికి అవగాహన ఉంటే పట్టణ ప్రాంతంలో 36.9 శాతం మందికి ఉన్నది. పు రుషుల విషయంలో గ్రామా ల్లో 28.9 శాతం మందికి ఉంటే, పట్టణాల్లో 33 శాతం మందికి అవగాహన ఉన్నది. ఇక నిరోధ్‌ వాడకంపై గ్రామీణ మహిళల్లో 65.4 శాతం మందికి అవగాహన ఉంటే, పట్టణాల్లో 74.7 శాతం మందికి ఉన్నదని నమస్తే తెలంగాణ వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం