Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాం: పిడుగులు పడి 18 ఏనుగులు మృతి

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (11:53 IST)
అస్సాంలోని నాగావ్ జిల్లాలో 18 ఏనుగులు మృతి చెందాయి. కండోలీ అభయారణ్యంలో పిడుగులు పడడంతో ఆ ఏనుగుల మంద ప్రాణాలు కోల్పోయిందని అక్కడి అటవీ అధికారులు వెల్లడించారు. అభయారణ్యం సమీపంలోని గ్రామస్థులకు అడవిలో ఏనుగుల కళేబరాలు పెద్దసంఖ్యలో కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 
ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ''పెద్ద సంఖ్యలో ఏనుగులు మృత్యువాత పడడం కలచివేసింది. దీనిపై విచారణకు ఆదేశించాను'' అని ఆయన చెప్పారు. భారత్‌లో 27 వేలకు పైగా ఏనుగులు ఉండగా అందులో 21 శాతం ఒక్క అస్సాం రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒకేసారి ఇంత పెద్దసంఖ్యలో ఏనుగులు చనిపోవడం అస్సాంలో గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి.

 
ఏనుగుల మరణంపై అస్సాం అటవీ మంత్రి పరిమళ్ శుక్లవైద్య కూడా స్పందించారు. కథియాటోలీ రేంజ్ అటవీ ప్రాంతంలో భారీగా పిడుగులు పడి 18 ఏనుగులు మరణించడం బాధాకరం అంటూ ఆయన స్పందించారు. అటవీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరుపుతారని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments