Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జెంటీనా: చిన్నారులపై అత్యాచారం ... క్రైస్తవ మతాధికారులకు 40 ఏళ్ల జైలు శిక్ష

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (16:13 IST)
అర్జెంటీనాలోని ఒక చర్చి స్కూలులో వినికిడి లోపం ఉన్న చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు రోమన్ క్యాథలిక్ మతాధికారులకు అక్కడి కోర్టు 40 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.
 
మెండోజా ప్రావిన్స్‌లోని ఒక చర్చి స్కూలులో 2004 నుంచి 2006 మధ్య వినికిడి లోపం గల కొందరు చిన్నారులపై హొరాసియో కొర్బాచో, నికోలా కొరాడీ అనే ఇద్దరు మతాధికారులు అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువు కావడంతోవారికి జైలు శిక్ష విధించారు.
 
పోప్ ఫ్రాన్సిస్ సొంత దేశమైన అర్జెంటీనాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ కేసు విషయంలో చర్చి చాలా నెమ్మదిగా స్పందించిందన్న ఆరోపణలున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ చర్చిల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు పెరుగుతున్నాయి.
 
కోర్టు ఏం చెప్పింది? 
మెండోజాలోని అంటోనియో ప్రొవోలో ఇనిస్టిట్యూట్‌కు చెందిన చిన్నారులపై 59 ఏళ్ల కొర్బాచా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువవడంతో ఆయనకు 45 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆరోపణలు ఎదుర్కొన్న మరో మతాధికారి 83 ఏళ్ల కొరాడీ(ఇటలీ దేశస్థుడు)కి 42 ఏళ్ల జైలు శిక్ష వేశారు.
 
ఇటలీలోని వెరోనాలో ఉన్న ఒక చర్చి స్కూలులో 1970 ప్రాంతంలో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నా గతంలో ఎన్నడూ అభియోగాలు నమోదు కాలేదు. లూజన్ డి కుయో స్కూల్ గార్డనర్ అర్మాండో గోమెజ్‌కి 18 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ శిక్షలపై అప్పీలు చేసుకోవడానికి కోర్టు అవకాశం కల్పించలేదు.
 
తీర్పు వచ్చాక ఏం జరిగింది? 
జైలు శిక్షలు విధించిన తరువాత నిందితులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ, తీర్పు సమయంలో కోర్టులో ఉన్న కొందరు బాధిత పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఏడుస్తూ ఒకరినొకరు పట్టుకోవడం కనిపించింది. కోర్టు వెలుపల కొందరు యువత తీర్పుపై హర్షం వ్యక్తంచేయడం కనిపించింది.
 
''ఇది మాకు, ప్రపంచానికి ఎంత ముఖ్యమైన తీర్పో మీకు తెలియదు'' అని ఓ బాధితురాలి తండ్రి ఏరియల్ లిజారగా 'వాషింగ్టన్ పోస్ట్'తో అన్నారు. 'చర్చి ఈ వేధింపులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మతాధికారులు మా పిల్లలపై అత్యాచారాలకు పాల్పడ్డారు, వేధించారు'' అన్నారాయన.

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం