Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం తెలంగాణకు ఎంతో చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదు: ప్రధాని మోదీ

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (16:34 IST)
సికింద్రాబాద్‌లో వందేభారత్ రైలు ప్రారంభించిన అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్‌కి వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి పనుల కోసం చేస్తున్న ఖర్చు వివరాలు తెలిపారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందని మోదీ అన్నారు.
 
‘మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటుచేయనుంది. అందులో ఒకటి తెలంగాణలో వస్తుంది. ఈ టెక్స్‌టైల్ పార్కుతో యువతకు ఉపాధి లభిస్తుంది. తెలంగాణలో విద్య, ఆరోగ్య రంగాలపైనా కేంద్రం పెట్టుబడులు పెడుతోంది అన్నారు మోదీ. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వల్ల ప్రతి ప్రాజెక్టులో జాప్యం జరుగుతోందని మోదీ అన్నారు.
 
‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్ల అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుంది. ప్రజలకు నష్టం జరుగుతుంది. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అన్నారు మోదీ.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments