Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎముకల బలం కోసం.. రొయ్యలు, చేపలు తీసుకోండి.. నువ్వులు కూడా?

మహిళల్లో 30 దాటితే ఎముకల బలం తగ్గిపోతూ వస్తుంది. ఇందుకు ఎముకల్లోని క్యాల్షియం శక్తి తగ్గుతూ రావడమే కారణం. తద్వారా వెన్నునొప్పి, కీళ్లనొప్పులు ఏర్పడతాయి. అందుకే శరీరంలోని ఎముకలు బలంగా ఉండాలంటే.. క్యాల్

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (14:20 IST)
మహిళల్లో 30 దాటితే ఎముకల బలం తగ్గిపోతూ వస్తుంది. ఇందుకు ఎముకల్లోని క్యాల్షియం శక్తి తగ్గుతూ రావడమే కారణం. తద్వారా వెన్నునొప్పి, కీళ్లనొప్పులు ఏర్పడతాయి. అందుకే శరీరంలోని ఎముకలు బలంగా ఉండాలంటే.. క్యాల్షియం, విటమిన్ డి చాలా అవసరం.

ముఖ్యంగా క్యాల్షియం అనేది మహిళలకు ఎక్కువ కావాల్సి వుంది. ఎందుకంటే..? నెలసరి, ప్రసవం సమయాల్లో మహిళల్లోని క్యాల్షియం చాలామటుకు టాక్సిన్ల రూపంలో తొలగిపోతుంది. అందుకే మహిళలు రోజూ రెండు గ్లాసుల పాలు తప్పకుండా తీసుకోవాలి. లేదంటే పాల ఉత్పత్తులు పన్నీరు, పెరుగు, మజ్జిగ, చీజ్ వంటివి తీసుకోవడం చేయాలి.  
 
అలాగే క్యాల్షియం పొందాలంటే.. సిట్రస్ ఫ్రూట్స్‌ల్లో ఒకటైన ఆరెంజ్‌ను తీసుకోవాలి. ఇందులోని విటమిన్ సి, క్యాల్షియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక సీఫుడ్స్‌లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే రొయ్యల్ని మాసానికి రెండుసార్లు తీసుకోవాలి. వీటిని ఎక్కువ సేపు ఉడికిస్తే అందులోని క్యాల్షియం తొలగిపోతుంది.

ఇదేవిధంగా ఓట్స్‌ను రోజూ తీసుకుంటే గుండెకు ఎంతో మేలు చేసినవారవుతారు. ఇందులో పీచు, క్యాల్షియం ఎముకలకు కూడా మేలు చేస్తాయి. ఇక చేపలను కూడా వారంలో ఓ రోజు డైట్‌లో చేర్చుకోవాలి.
 
ఆకుకూరలు, బ్రొకోలీ, బాదంను రోజూ తీసుకోవాలి. అలాగే నువ్వుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒక టీ స్పూన్ నువ్వుల్లో ఒక గ్లాసు పాలల్లోని క్యాల్షియం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే నువ్వుల్ని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments