Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలా? ఐతే రైస్‌ను పక్కనబెట్టేయండి.. ఓన్లీ ఫ్రూట్స్ & వెజిటబుల్స్ తీసుకోండి..

కంప్యూటర్ల ముందు గంటల గంటలు అతుక్కుపోతున్నారా? తద్వారా బరువు పెరిగిపోయారా? ఐతే రైస్ పరిమాణం తగ్గించేయండి. లేదా రైస్‌ను పూర్తిగా పక్కనబెట్టి.. పండ్లు, కూరగాయలను తినడం మొదలెట్టండి. సలాడ్స్ రూపంలో వీటిని

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (14:06 IST)
కంప్యూటర్ల ముందు గంటల గంటలు అతుక్కుపోతున్నారా? తద్వారా బరువు పెరిగిపోయారా? ఐతే రైస్ పరిమాణం తగ్గించేయండి. లేదా రైస్‌ను పూర్తిగా పక్కనబెట్టి.. పండ్లు, కూరగాయలను తినడం మొదలెట్టండి. సలాడ్స్ రూపంలో వీటిని తీసుకుంటే కచ్చితంగా మూడు నెలల్లో బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు ఫుల్‌గా లాగించకుండా కొంచెం కొంచెంగా రైస్ తీసుకుని.. మిగిలిన సమయాల్లో స్నాక్స్‌కు బదులు కీర, టమోటా, బ్రొకోలీ, ఉల్లిపాయ ముక్కల్ని నమిలితే బరువు తగ్గిపోతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
పండ్లలో సిట్రస్ పండ్లను అధికంగా తీసుకోవాలి. ఆరెంజ్, నిమ్మ పండ్ల రసాన్ని రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. రోజూ 30-45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఆమ్లా రసంతో కాస్త అల్లం రసాన్ని కలిపి రోజూ ఉదయం పూట తాగితే శరీరంలో ఫాట్ కరిగిపోతుంది. అలాగే క్యారెట్‌తో పాటు తేనెను కలుపుకుని తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మటాష్ అవుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. వేడినీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే బరువు తగ్గుతారు. ఈ జ్యూస్‌ను రోజుకు మూడు లేదా నాలుగుసార్లు తీసుకోవడం మంచిది. 
 
అయితే ఆహారం తీసుకున్న తర్వాతే వేడినీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి. ఇంకా  బరువు తగ్గాలంటే.. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి. ఇంకా రోజువారీ డైట్‌లో కీరదోస, ఉసిరి, కొత్తిమీర, మునగ, ద్రాక్ష, ఆరెంజ్, టమోటా, బొప్పాయి, అనాస, నిమ్మ, జామకాయ, పుదీనా, ఉల్లిపాయలు, కర్బూజ, కరివేపాకు, అరటి కాడ జ్యూస్ వంటివి చేర్చుకుంటే 3 నెలల్లో బరువు తగ్గుతారని న్యూట్రీషన్లు అంటున్నారు.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments