శొంఠిని బియ్యపు పిండిలో కలిపి తీసుకుంటే? మీ ఆరోగ్యానికి?

శొంఠి ఒక రకమైన ఆయుర్వేదంగా ఉపయోగించే మందు. ఈ శొంఠిని అల్లంను ఎండబెట్టి తయారుచేస్తారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతుంటారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు. శొంఠ

Webdunia
సోమవారం, 21 మే 2018 (10:59 IST)
శొంఠిని అల్లంను ఎండబెట్టి తయారుచేస్తారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో  వాడుతుంటారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు. శొంఠి జీర్ణశక్తిని పెంచుతుంది. కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది. దగ్గు, ఆయాసము, వాంతి, గుండె జబ్బులను తగ్గిస్తుంది. మూలవ్యాధి, కడుపుబ్బరము, కడుపునొప్పి, మలబద్ధకంను తగ్గిస్తుంది. 
 
శొంఠిని వేడిచేసిన నీటిలో మరిగించి, ఆ నీళ్ళతో స్నానం చేసినట్లైతే కీళ్ళ నొప్పులు తగ్గుటకు ఉపయోగపడుతుంది. శొంఠి ముక్కను నమిలి బుగ్గన పెట్టుకుంటే పంటి నొప్పులు, చిగురు నొప్పులు తగ్గుతాయి. శొంఠిని అరగదీసిన ఆ గంథాన్ని కణతలకు రాసుకుంటే తలనొప్పి వంటి వాటిని నివారిస్తుంది. దీని పొడిని బియ్యపు పిండితో కలిపి నుదిటి మీద పట్టీలా వేసుకున్నా తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది.
 
అరలీటరు మంచి నీళ్ళలో పది గ్రాముల శొంఠిని వేసి బాగా మరగబెట్టి, ఆ నీళ్ళను శుభ్రంగా వడగట్టి కషాయంగా తీసుకుంటే పొడిదగ్గు, విరేచనాలను దూరం చేస్తుంది. శొంఠి, జీలకర్ర, కొత్తిమీర సమాన భాగాలుగా తీసుకుని వాటిని నీళ్ళల్లో వేసి మరిగించి, వడగట్టి, చల్లార్చి తాగితే ఆరోగ్యానికి మంచిది. పదిగ్రాముల శొంఠిని అరగదీసి పులిసిన మజ్జిగలో కలుపుకుని రోజుకు మూడ సార్లు తాగితే కడుపుకు సంబంధించిన వ్యాధులు దూరమగుటకు ఉపయోగపడుతుంది.
 
శొంఠి పొడిని నేతిలో కలిపి అన్నంలో తీసుకుంటే అజీర్ణశక్తికి చాలా ఉపయోగపడుతుంది. బాలింతరాలుకు శరీరం గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతుంటారు. పసి పిల్లల అజీర్ణ సమస్యకు శొంఠిని తక్కువ మోతాదులో వాడుతుంటారు. జిగురు, రక్తవిరోచనాలకు శొంఠిని రాత్రివేళ ఆవు మజ్జిగలో నానబెట్టి ఉదయం ఆ మజ్జిగతోనే ఆ శొంఠిని నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి వాడుతుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

5 వేలమంది యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించడానికి ఏపితో బివైఎస్‌టి భాగస్వామ్యం

రాజ్యసభకు వెళ్లనున్న మెగా బ్రదర్ నాగబాబు?

ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ : సీఎం చంద్రబాబు

ఆర్థిక సమస్యలు.. పెంచలేక ముగ్గురు కుమార్తెలను చంపేసిన తండ్రి

మిస్టర్ జగన్.... సీఎంగా ఉన్నపుడే ఏం పీకలేకపోయావ్... నా జోలికి రావొద్దు : శివాజీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తరుణ్ భాస్కర్.. గాయపడ్డ సింహం నుంచి సెటైరికల్ రాప్ సాంగ్

Santosh Krishnan: విలేజ్ బ్యాక్ డ్రాప్ తో R చిత్రం ప్రారంభం

Devakonda: హృదయాలను తాకుతున్న ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ గీతం సంచారమే

Manchu Laxmi: లేచింది మహిళాలోకం మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు, నవ్వించే చిత్రం: మంచు లక్ష్మి

Raviteja: డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి

తర్వాతి కథనం
Show comments